Home News AP Kotamreddy Sridhar Reddy | నన్ను ఎన్‌కౌంటర్ చేస్తేనే నా గొంతు ఆగుతుంది.. జగన్‌కు నమ్మకద్రోహం...

Kotamreddy Sridhar Reddy | నన్ను ఎన్‌కౌంటర్ చేస్తేనే నా గొంతు ఆగుతుంది.. జగన్‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Image Source: Kotamreddy sridhar Reddy Facebook

Kotamreddy Sridhar Reddy | “నా గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం.. ఎన్‌కౌంటర్ చేయించండి.. అప్పుడే నా గొంతు ఆగుతుంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవమానించిన చోట ఉండకూడదని భావించి నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే మరుసటి రోజే సజ్జల రామకృష్ణారెడ్డి పోస్టు ఊడిపోతుందని హెచ్చరించారు. తనను అరెస్టు చేస్తారంటూ సజ్జల లీకులు ఇవ్వడంపై కోటం రెడ్డి మండిపడ్డారు.

నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోవచ్చంటూ కోటం రెడ్డి సవాల్ విసిరారు. శాశ్వతంగా జైల్లో పెట్టినా వెనకడుగు వేయనన్నారు. కేసులు పెట్టి మీరు అలసిపోవాలి తప్పా.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదంటూ తేల్చి చెప్పారు. తన గొంతు ఆగాలంటే ఎన్‌కౌంటర్ ఒక్కటే పరిష్కారమన్నారు. ఎన్‌కౌంటర్ చేస్తేనే తన గొంతు ఆగుతుందన్నారు.

పార్టీలో ఆఖరిదాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని, కానీ తాను అలా చేయలేదని అన్నారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తయో తెలుసని అన్నారు. తాను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదన్న కోటం రెడ్డి.. 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు తన మనసు విరిగిపోయిందన్నారు. ప్రాణాతిప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న ఆధారాలు చూపించిన తర్వాతనే బయటకు వచ్చానని స్పష్టం చేశారు.

నెల ముందుదాకా తనకు ఎలాంటి ఆలోచనలు లేవని, ఫోన్ ట్యాపింగ్ ఆధారం దొరికిన తర్వాతే దూరం జరిగినట్లు చెప్పుకొచ్చారు. వైకాపా ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులు తనపై మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదన్నారు.

అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు తనను బాధించాయని కోటం రెడ్డి చెప్పారు. సీఎం జగన్‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు అండగా ఉంటాడని అన్నారు. తన కుటుంబం అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదన్న కోటం రెడ్డి.. అనిల్ ఓడిపోయినప్పుడు తన కుటుంబం మొత్తం అల్లాడిపోయిందని పేర్కొన్నారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని, పిల్లల ప్రస్తావన ఎందుకంటూ ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడును అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు కలిశారంటూ ప్రశ్నించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vallabhaneni Vamsi | డొక్క పగలదీస్తా.. మా గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు..వైసీపీ నేతలపై వల్లభనేని వంశి ఫైర్

K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్ సంతాపం..

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K Vishwanath | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే. విశ్వనాథ్‌ కన్నుమూత

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఆపరేషన్ అన్నా.. ఆస్పత్రి అన్నా భయం.. కానీ చివరకు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు

K.Viswanath | సీఎం కేసీఆర్ కోరిక నెరవేర్చకుండానే కన్నుమూసిన కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

Exit mobile version