SI Exams Schedule | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ముఖ్య సమాచారం ఇచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్, పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.
మొత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష, ఐటీ విభాగానికి చెందిన పరీక్ష 30 వ తేదీన, ఎస్సై (ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11 వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11 వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు.
మొదట ప్రకటించిన పరీక్ష తేదీల్లో ఇతర పరీక్షలు ఉన్నాయని వచ్చిన వినతుల మేరకే తేదీల్లో మార్పులు చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఈ విభాగాలకు ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
అందులో అర్హత సాధించిన వారికి డిసెంబర్ నెలలో ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఇందులో 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kanti Velugu | తెలంగాణలో కంటి వెలుగుకు ఆధార్ తప్పని సరి.. మంత్రి హరీశ్రావు ఆదేశాలు
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?