Weather Report | ఉత్తర భారత దేశాన్ని చలి వణికిస్తోంది. కొద్దిరోజులుగా అక్కడ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. వచ్చే వారంలో ఇవి మరింత పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాదిన వచ్చే వారంలో మైనస్ 4 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు రోజుల నుంచి జనవరి 19 వ తేదీ వరకు తీవ్ర శీతలగాలులు వీస్తాయని పేర్కొన్నారు.
జనవరి 16 నుంచి 18 మధ్య అవి తీవ్ర స్థాయికి చేరుకుంటాయని నవదీప్ దహియా ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. 21వ శతాబ్ధిలో ఇదే అత్యంత చలికాలం కాగలదని ఆయన ట్వీట్లో తెలిపారు. గత కొన్ని వారాలుగా రాత్రి పూట చలి తీవ్రంగా ఉంటుంది. 23 ఏళ్ల తర్వాత ఇదే అత్యంత చలికాలం అని ఆయన పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇంతకుముందు 2006 లో , 2013లో ఇంతలా చలి ఉందని వాతావరణ నిపుణులు జెనమని తెలిపారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ, యూపీ, ఉత్తర రాజస్థాన్లో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?