TSRTC MD Sajjanar | రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రోడ్లన్ని బిజీబిజీగా మారిపోయాయి. ఈ సమయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు కొన్ని సలహాలిచ్చారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందని… సమయం వృథా చేసుకోకుండా.. ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించడని పేర్కొన్నారు.
స్కూళ్లు, కాలేజీలకు ఈ నెల 13 నుంచి 17 వరకు పండుగ సెలవులు ఇవ్వడంతో రోడ్ల పై పండగ రద్దీ మొదలైంది. గురువారం నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. సొంత ఊర్లకు జనాలు తరలివెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
వృద్ధులు, చిన్నారులతో ప్రయాణాలు చేసేవారు రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ హైవే మీద వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.
వాహనాలకు ఫాస్టాగ్ లు ఉన్నప్పటికీ అవి వెంటనే స్కానింగ్ అవ్వకపోవడంతో కొన్నిసార్లు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఒకేసారి పరిమితికి మించి రావడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్ గేట్ సిబ్బంది వాహనాలను క్రమబద్దీకరించడంలో తలమునకలై ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సజ్జనార్ స్పందించారు. ” సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించొద్దు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. ప్రయాణీకులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు ” అంటూ సజ్జనార్ పేర్కొన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KCR | దేశం అభివృద్ధి చెందాలంటే.. కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి: కేసీఆర్
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?
Breaking News | షిర్డీ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది సాయిబాబా భక్తులు దుర్మరణం
Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్