Roja Selvamani | జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మండిపడ్డారు. రణస్థలంలో గరువారం జరిగిన జనసేన యువశక్తి సభలో రోజాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. ప్రజల కోసం ప్రతి వెధవ, సన్నాసితో మాటలు పడాల్సి వస్తోందని అన్నారు. చివరికి డైమండ్ రాణితో కూడా తిట్లు తినాల్సి వస్తుందని రోజాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని యువత కోసమే తాను తిట్లు తింటున్నానని పవన్ అన్నారు.
యువత తనను నమ్మితే సమస్యలు తీరుస్తానని పవన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది తిట్టడానికి కాదని, ఒకరితో మాటలు పడుతున్నా బాధలేదని అన్నారు. సినిమాల్లో ఉంటే తనను తిడుతున్న వాళ్లే సెల్ఫీలు దిగేవారని అన్నారు. పేదల కోసం తిట్లు పడినా సంతోషమేనని, ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
అయితే రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రెండు సార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్తో తిట్టించుకోవాలా ? థూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ట్విట్టర్లో విరుచుకుపడ్డారు.
శ్రీకాకుళంలో కోటి మంది జనాభా ఉంటే 45 లక్షల మంది వలస వెళ్లారన్న పవన్ వ్యాఖ్యలపైనా రోజా స్పందించారు. టీడీపీ ఏం స్క్రిప్టు రాసిస్తే అది చదవడమేనా ? చెక్ చేసుకోవాలని తెలియదా ? అంటూ విమర్శించారు. అసలు శ్రీకాకుళం జనాభా కోటి ఉందా ? వలస వెళ్లింది 45 లక్షలా ? అని ప్రశ్నించారు. ఈ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్లిపోయారు అంటూ సెటైర్లు వేశారు. ” శ్రీకాకుళంలో 45 లక్షలు జనాభానే లేరు.. 45 లక్షల మంది వలసలా.. టీడీపీ స్క్రిప్టు ఇస్తే మాత్రం కాస్త చెక్ చేసుకోవాలని తెలియదా దత్తపుత్రా ” అంటూ విమర్శించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?
Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
Hyper Aadi | పవన్ కళ్యాణ్కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్ ఆది సెటైర్లు