WPL 2023 | టైమ్ 2 న్యూస్, ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు నగారా మోగింది. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు, బాలీవుడ్ తారల డ్యాన్స్ షోలు, కండ్లు మిరుమిట్లు గొలిపే టపాసుల వెలుగుల్లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం చూపారు. టోర్నీ ఆరంభానికి ముందే విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన డబ్ల్యూపీఎల్లో మొదటి మ్యాచ్లోనే ముంబై ప్లేయర్లు దంచికొట్టి.. టోర్నీలో శుభారంభం చేశారు. శనివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి పోరులో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. హీలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపారు. బ్రంట్ (23; 5 ఫోర్లు), పూజ వస్త్రాకర్ (15; 3 ఫోర్లు) కూడా రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకు పరిమితమైంది. దయాలన్ హేమలత (29 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా 4 వికెట్లు పడగొట్టగా.. బ్రంట్, అమేలియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
10 ఓవర్ల వరకు ఒక లెక్కా.. ఆ తర్వాత మరో లెక్క
అచ్చం ఐపీఎల్ను తలపించిన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇన్నింగ్స్ 10 ఓవర్ల వరకు మామూలుగానే సాగినా.. ద్వితియార్ధంలో హర్మన్ సునామీలా విరుచుకుపడింది. ఓపెనర్ యస్తిక భాటియా (1) మూడో ఓవర్లోనే వెనుదిరగగా.. మాథ్యూస్, బ్రంట్ ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో ముంబై 10వ ఓవర్ పూర్తయ్యేసరికి 77 పరుగులు చేసి ఈ ఇద్దరి వికెట్లు కోల్పోయింది. ఇక అక్కడి నుంచి హర్మన్ దంచుడు ప్రారంభమైంది. స్నేహ్ రాణా ఓవర్లో రెండు ఫోర్లతో బౌండ్రీలకు గేట్లు ఎత్తిన హర్మన్ ఔటయ్యేంత వరకు అదే జోరు కొనసాగించింది. 12, 13 ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్.. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4,4,4,4 అరుసుకుంది. గార్డ్నర్ వేసిన తదుపరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన ముంబై కెప్టెన్.. ఈ క్రమంలో 22 బంతుల్లో డబ్లూ్యపీఎల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకుంది. మరో భారీ షాట్కు యత్నించి హర్మన్ ఔట్ కాగా.. ఆఖర్లో అమేలియా కెర్ర్, పూజ వస్త్రాకర్ అదే జోరు కొనసాగించడంతో ముంబై రెండొందల మార్క్ దాటింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Manchu Manoj | సైలెంట్గా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్
Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!
Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?