Metro Station | హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ గ్రామానికి చెందిన మారెమ్మ అర్ధరాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి దూకింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన యువతిని మహబూబ్నగర్కు చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.