Delhi Accident | కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్ యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తప్ప తాగిన కొందరు యువకులు కారుతో స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టడమే కాకుండా .. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ సంఘటన నుంచి తేరుకోకమునుపే ఇలాంటి తరహాలోనే మరో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా – ఢిల్లీ హైవేపై జనవరి 1న బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో రాత్రంతా వచ్చేపోయే వాహనాల చక్రాల కింద నలిగిపోయి మృతదేహం నుజ్జునుజ్జయిపోయింది. డెడ్ బాడీ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చెల్లాచెదురై 100 మీటర్ల పొడవున పడిపోయాయి. ఉదయం పొగమంచు తగ్గిన తర్వాత ఒక వ్యక్తి రోడ్డుపై పడి ఉన్న శరీరం ముక్కలను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రోడ్డు పక్కన పడి ఉన్న బైక్ ఆధారంగా మృతుడు మధ్యప్రదేశ్లోని గోవింద్నగర్కు చెందిన చరణ్ నర్వారియా (30) అనే యువకుడిగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Read More Articles:
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్