Home Latest News Telangana Secretariat| కేసీఆర్ పుట్టినరోజు నాడే నూతన సచివాలయానికి శంకుస్థాపన.. హాజరుకానున్న తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు

Telangana Secretariat| కేసీఆర్ పుట్టినరోజు నాడే నూతన సచివాలయానికి శంకుస్థాపన.. హాజరుకానున్న తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు

Image Source: Telangana CMO Facebook

Telangana Secretariat| తెలంగాణ నూతన సచివాలయ భవనానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అనగా ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హాజరుకానున్నారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సచివాలయం ప్రారంభోత్సవానికి ముందు ఉదయం వాస్తు పూజ, చండీయాగం, సుదర్శన యాగం నిర్వహించనున్నారు. సచివాలయ ప్రారంభం తరువాత మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ తరహాలో భారీ ఎత్తున జనసమీకరణ కూడా చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో స్టాలిన్, హేమంత్ సోరెన్, తేజస్వీ యాదవ్, లలన్ సింగ్, ప్రకాశ్ అంబేద్కర్ సహా పలువురు జాతీయ స్తాయి నేతలు పాల్గొంటారని మంత్రి వేముల తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఎందుకు?

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Exit mobile version