Telangana Cabinet | సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే మత లేని వారికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమ జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల నగదు అందించేందుకు సరికొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ పథకానికి గృహలక్ష్మి అని నామకరణం చేసినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ( ఏప్రిల్ 1వ తేదీ ) నుంచి ఈ పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.
గృహలక్ష్మీ పథకం కింద 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఓక్కో నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున 3,57,000 మందికి, స్టేట్ కోటా కింద 43వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన 4 లక్షల మందికి రూ.3 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని తెలిపారు. ఈ నగదును మూడు దఫాల్లో రూ. లక్ష చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మహిళల పేరు మీదనే ఈ ఇల్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం రూ.12వేల కోట్లు ఖర్చవుతాయని.. వీటికోసం బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు చెప్పారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?
Viral News | బైక్ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!
H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?