Home Latest News Heeraben | హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

Heeraben | హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

Image Source : twitter

Heeraben | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. గుజరాత్ గాంధీనగర్‌లోని శ్మశాన వాటికలో మోదీ తన సోదరులతో కలిసి హీరాబెన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్.. అహ్మదాబాద్‌లోని యూఎస్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆమె మృత దేహాన్ని ముందుగా గాంధీనగర్‌లోని తమ స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఆమె పాడెను మోశారు. అంతిమ యాత్ర వాహనంలోనూ తల్లి హీరాబెన్ పార్థివదేహం వద్దనే కూర్చొని భావోద్వేగానికి గురయ్యారు. తన సోదరులతో కలిసి గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కరాలు నిర్వహించారు.

అంతకుముందు తల్లి మరణవార్తను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ నా తల్లి నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని దేవుడి వద్దకు వెళ్లిపోయింది. ఆమె జీవితం ఓ తపస్సు లాంటిది. ఒక సన్యాసిలా, కర్మ యోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపింది. ఆమెలో త్రిమూర్తులు ఉన్నారని భావిస్తున్నా’ అంటూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. హీరాబెన్ మరణవార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Heeraben | సామాన్యురాలే కానీ.. శక్తిమంతురాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం

Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..

TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు

TSPSC Group 2 Notification | నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

Exit mobile version