Telangana | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటికీ తెలంగాణ అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయానికి అతి తక్కువ అప్పులతో ఉన్న రాష్ట్రం.. లక్షల కోట్ల అప్పులు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని చెప్పింది. 2022 నాటికి రూ.2.83 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పులు 2022 అక్టోబర్ నాటికి 4.33 లక్షల కోట్లకు చేరిందని వివరించింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు రాతపూర్వకంగా వివరణ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులను తీసుకుని వస్తోందని బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. మిగులు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రాన్ని నేడు దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలోకి చేర్చేశారని విపక్ష నేతలు బీఆర్ ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. అలాగని తెచ్చిన అప్పులను కూడా సరైన పద్ధతిలో ఉపయోగించడం లేదని.. నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలను ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. తీసుకుని వచ్చిన అప్పులతోనే అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందోని అంటోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!
Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..
Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక