Breaking News | కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని ఓ ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు.
జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు ముందుగా ఒక కార్మికుడు అందులోకి దిగాడు. కానీ అతనికి ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మరో కార్మికుడు లోపలికి వెళ్లాడు. ఇలా ఒకరిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లి ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పాడేరు వాసులు, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరిక!
Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు