Laxmi Parvathi on Taraka Ratna Death | నందమూరి తారకరత్న మృతిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్తోపాటు ఆయన చేస్తున్న యువగళం పాదయాత్రకు చెడ్డపేరు వస్తుందన్న కారణంతోనే తారక రత్న మరణవార్తను చంద్రబాబు ఇన్నాళ్లు దాచిపెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు తారకరత్నను ఆస్పత్రిలో ఉంచారంటూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందన్నారు. తారకరత్న తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను చంద్రబాబు మానసిక క్షోభకు గురిచేశాడని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి.. చిన్న వయసులో తారకరత్న అకాల మరణం బాధకరమని అన్నారు. నందమూరి కుటుంబంపై చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయ విధానం అవలంభించారన్న లక్ష్మీ పార్వతి.. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే తారక రత్న మరణవార్త ప్రకటించి ఉండాల్సిందన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర, లోకేశ్కు చెడ్డపేరు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో మరణవార్తను చంద్రబాబు ఇన్నాళ్లు దాచిపెట్టారని ఆరోపించారు. 23 రోజులపాటు డ్రామా చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ ఆంధ్రప్రదేశ్కు అపశకునం అని ప్రజలు భావిస్తున్నారంటూ లక్ష్మీ పార్వతి విమర్శించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
BRS MLA Sayanna | బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..
Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం
Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు
Passport | పాస్పోర్టు అప్లై చేసే వాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఐదు రోజుల్లోనే వెరిఫికేషన్ కంప్లీట్