Home News AP Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | ఓ యువకుడు తమ ఇంట్లో పుట్టిన ఓ ఎద్దును పెళ్లి చేసుకున్నాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది వాళ్ల ఇంట్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో తరతరాలుగా ఈ వింత ఆచారం కొనసాగుతోంది. మరి ఆ ఆచారం ఏంటి? ఎద్దును ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లిలో పూర్వం నుంచి ఓ ఆచారం ఉంది. సంక్రాంతి పర్వదినాన తోడుపెద్దు ( ఎద్దు)ను ఊరేగిస్తారు. అయితే కొన్నేళ్ల క్రితం ఒక తోడపెద్దు చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు భోగి పండుగ నాడు మురుకుతి రామానాయుడు అనే వ్యక్తి ఇంట్లో ఓ మగ దూడ జన్మించింది. దాన్ని సింహాద్రి అప్పన్న పుట్టుకగా ఆ కుటుంబం భావించింది. దూడకు మూడేళ్ల వయసు వచ్చిన తర్వాత తోడుపెద్దుగా చేయడానికి ముందు ఆ ఇంట్లోని యువకుడితో పెళ్లి జరిపించడం ఆచారంగా వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లి తంతు నిర్వహించారు. అలా అని ఏదో మొక్కుబడిగా జరిపించలేదు. సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఇంటి ముందు అరటి ఆకులతో పందిరి వేశారు. ఎద్దుతో పాటు యువకుడికి పసుపు పెట్టి మంగళ స్నానాలు చేయించారు. అనంతరం బాజాభజంత్రీల నడుమ పెళ్లి జరిపించారు. వచ్చిన అతిథులకు భోజనాలు కూడా పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసి ఏదేం ఆచారం నాయనా అని అనుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

Passport | పాస్‌పోర్టు అప్లై చేసే వాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఐదు రోజుల్లోనే వెరిఫికేషన్ కంప్లీట్

Exit mobile version