Home Latest News Dead Man | నోట్లో పాలు పోయగానే లేచి కూర్చున్న శవం.. తమిళనాడులో వింత ఘటన

Dead Man | నోట్లో పాలు పోయగానే లేచి కూర్చున్న శవం.. తమిళనాడులో వింత ఘటన

Dead Man | చనిపోయిన వ్యక్తి బతికొచ్చాడు ! అంత్యక్రియల తంతు మొదలుపెట్టగానే లేచికూర్చొన్నాడు. దింపుడు కళ్లెం దగ్గర నోట్లో పాలు పోయగానే కళ్లు తెరిచాడు. తమిళనాడులోని పుదుకోట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామానికి చెందిన 60 ఏళ్ల రైతు షణ్ముగం కొంతకాలంగా గుండె, కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. రెండు రోజుల కిందట పరిస్థితి విషమించడంతో పొన్నమరావతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు కూడా ఇక లాభం లేదని చేతులెత్తేశారు. ఇక చేసేదేమీ లేక షణ్ముగాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో పూర్తిగా చలనం కోల్పోయాడు. దీంతో షణ్ముగం మరణించాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. బంధువులకు సమాచారం అందించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

అంత్యక్రియల్లో భాగంగా షణ్ముగం మృతదేహాన్ని ఇంటిబయట తిన్నెలో కూర్చొబెట్టారు. వారి ఆచారం ప్రకారం షణ్ముగం కొడుకు చివరిసారిగా తండ్రి నోట్లో పాలుపోశాడు. ఇలా పాలు పోశాడో లేదో ఒక్కసారిగా షణ్ముగం దగ్గుతూ కళ్లు తెరిచాడు. అంతే అక్కడ ఉన్నవాళ్లంతా హడలిపోయారు. ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు.అందరూ తననే చూస్తుండటంతో అయోమయంలో పడిన షణ్ముగం ఏమైందంటూ ప్రశ్నించాడు. మొత్తానికి చనిపోయాడని అనుకున్న వ్యక్తి.. తిరిగి బతికాడని అంతా సంతోషించారు. ఈ విషయం ఇప్పుడు స్థానికంగా వైరల్‌గా మారింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?

Pilot Rohit reddy | ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేస్తా

Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్‌ కామెంట్స్‌.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన

Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్‌ రావు సెటైర్‌

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Exit mobile version