Fire Accident | మంచిర్యాల ( mancherial )జిల్లాలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని వుడిపెల్లిలో ఓ ఇంటికి శనివారం అర్ధరాత్రి నిప్పు అంటుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే వుడిపెల్లిలోని మాసు శివయ్య ( 50),మాసు పద్మ (45 ) దంపతులు ఉంటున్నారు. కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన పద్మ అక్క కుమార్తె మౌనిక (25 ) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల కిందట పద్మ వాళ్లింటికి వచ్చింది. అలాగే శివయ్య వాళ్ల సమీప బంధువు, సింగరేణి ఉద్యోగి అయిన శనివారపు శాంతయ్య (50) ఓ పని నిమిత్తం కూడా వాళ్లింటికి వచ్చాడు. వీరంతా శుక్రవారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు. వాళ్లంతా గాఢ నిద్రలో ఉండగా ఇంటికి నిప్పు అంటుకుంది. మంటలు చెలరేగడం చూసి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఇంట్లో ఉన్న ఆరుగురు సజీవదహనమయ్యారు.
ఘటనాస్థలిలో రెండు పెట్రోల్ డబ్బాలు
ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అసలు ఇంటికి నిప్పు ఎలా అంటుకుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఏదీ పేలలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే ఆ ఇంటికి సమీపంలో చలి మంట వేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తూ ఇంటికి నిప్పు అంటుకుందా? ఎవరైనా కావాలనే చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఘటనాస్థలికి సమీపంలో రెండు పెట్రోల్ డబ్బాలు, ఆటోలో కారప్పొడిని పోలీసులు గుర్తించారు. దీంతో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఘటనకు కారణమా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు.
Read More Articles |
Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన
Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్ రావు సెటైర్
Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?