Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsDroupadi Murmu | పావలా మిగులుతుందని.. ఆకలి చంపుకుని చదువుకున్నా.. ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకుని...

Droupadi Murmu | పావలా మిగులుతుందని.. ఆకలి చంపుకుని చదువుకున్నా.. ఆనాటి రోజులు గుర్తు తెచ్చుకుని భావోద్వాగానికి లోనైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu | పేదరికం వల్ల ఎన్నో రోజులు ఆకలిని చంపుకొని చదువుకున్న రోజులు ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో తాను విద్యనభ్యసించిన రమాదేవి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

నాలుగు దశాబ్దాల క్రితం.. యూనివర్సిటీలో ఎలాంటి సౌకర్యాలూ లేవని, నిమ్మరసం తాగి, తోపుడు బండి వద్ద పావలా పెట్టి కొన్న పల్లీలు తిని విద్యార్థులు ఆకలి తీర్చుకునేవారని ముర్ము చెప్పారు. మయూర్‌భంజ్‌ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్‌ చేరుకున్న తాను పేదరికం వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. పల్లీలు తినాలని ఉన్నా.. పావలా మిగులుతుందని ఆకలిని చంపుకొని గడిపిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయంటూ భావోద్వాగానికి గురయ్యారు.

మహిళలు.. పురుషులతో సమానంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం సంతోషకరమని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. తన జీవితం ఎత్తుపల్లాల సమ్మేళనమని శారీరక, మానసిక రుగ్మతలకు లోనై చాలా బాధపడ్డానని రాష్ట్రపతి పేర్కొన్నారు. యోగా, ప్రాణాయామం, ఆధ్యాత్మిక పథంవైపు ప్రయాణం సాగించిన తరువాత వాటన్నింటినీ జయించానని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొంది, ఆత్మస్థైర్యంతో ఇక్కడి వరకు వచ్చానన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు

Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News