Droupadi Murmu | పేదరికం వల్ల ఎన్నో రోజులు ఆకలిని చంపుకొని చదువుకున్న రోజులు ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఒడిశాలోని భువనేశ్వర్లో తాను విద్యనభ్యసించిన రమాదేవి వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమె మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
నాలుగు దశాబ్దాల క్రితం.. యూనివర్సిటీలో ఎలాంటి సౌకర్యాలూ లేవని, నిమ్మరసం తాగి, తోపుడు బండి వద్ద పావలా పెట్టి కొన్న పల్లీలు తిని విద్యార్థులు ఆకలి తీర్చుకునేవారని ముర్ము చెప్పారు. మయూర్భంజ్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్ చేరుకున్న తాను పేదరికం వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. పల్లీలు తినాలని ఉన్నా.. పావలా మిగులుతుందని ఆకలిని చంపుకొని గడిపిన రోజులు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయంటూ భావోద్వాగానికి గురయ్యారు.
మహిళలు.. పురుషులతో సమానంగా ప్రగతి పథంలో దూసుకెళ్తుండటం సంతోషకరమని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. తన జీవితం ఎత్తుపల్లాల సమ్మేళనమని శారీరక, మానసిక రుగ్మతలకు లోనై చాలా బాధపడ్డానని రాష్ట్రపతి పేర్కొన్నారు. యోగా, ప్రాణాయామం, ఆధ్యాత్మిక పథంవైపు ప్రయాణం సాగించిన తరువాత వాటన్నింటినీ జయించానని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొంది, ఆత్మస్థైర్యంతో ఇక్కడి వరకు వచ్చానన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్
Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం
Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
Bandi Sanjay | సచివాలయం డోమ్లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు