USA | కొద్దిరోజుల క్రితమే చైనా గూఢచార బెలూన్ను పేల్చిసిన అగ్రరాజ్యం అమెరికాను మరో అనుమానాస్పద వస్తువు భయపెట్టింది. తమ గగనతంలో అనుమానాస్పద వస్తువు ఎగురుతుండటం గమనించి అమెరికా వెంటనే దాన్ని పేల్చేసింది. అలస్కా ఉత్తర తీరంలో 40 వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఈ వస్తువు ఉన్నట్లు గుర్తించామని.. అనుమానాస్పదంగా కనిపించడంతో దాన్ని పేల్చేశామని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.
దీని గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ముందుగా సమాచారం అందించామని.. ఆయన ఆదేశాల మేరకు దాన్ని కూల్చేశామని జాన్ కిర్బీ తెలిపారు. ఈ వస్తువు గురువారమే అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ వెల్లడించారు. ఎఫ్ 22 యుద్ధ విమానం, ఏఐఎం 9 ఎక్స్ క్షిఫణి సాయంతో దాన్ని పేల్చేసినట్లు తెలిపారు. నీటి ఎగువన జనాభా చాలా తక్కువగా ఉన్న ప్రాంతంలో ఎగురుతుండటం గమనించి పేల్చివేసిటనట్లు చెప్పారు. శిథిలాలు కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
అయితే దీన్ని ఎవరు ప్రయోగించారో.. ఏ సంస్థకు చెందినదో అర్థం కావడం లేదని తెలిపారు. అసలు దీన్ని ఎందుకు ప్రయోగించారో కూడా తెలియదని అధికారులు వివరించారు. చైనాకు చెందిన బెలూన్ మాత్రం పూర్తిగా గూఢచర్యం కోసం ప్రయోగించినదగానే కిర్బీ తెలిపారు. ఇప్పుడు పేల్చిన వస్తువు సుమారు 40 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే చెప్తామన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్
Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం
Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన