Minister KTR | మెట్రో ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకరించడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని ఆయన అన్నారు. దేశంలోని చిన్న చిన్న నగరాల్లో కూడా మెట్రో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి మాత్రం మొండి చేయి చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచితే ఊరుకునేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీలతో సమానంగానే మెట్రో ఛార్జీలు ఉండాలని ఇప్పటికే అధికారులకు సూచించామని తెలిపారు. మెట్రోలో యాడ్స్ ఉండాలన్న నిర్ణయం కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈ సారి మెట్రో ప్రాజెక్టులో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాడానికి అల్ రెడీ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసిందని విపక్షాల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్ అంటే చార్మినార్ అని అందరికీ తెలుసని.. పాతబస్తీ మెట్రో పనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు.
కాగా..మెట్రో రైలు చార్జీలు పెంచాలని కోరుతూ హైదాబాద్ మెట్రో యాజమాన్యం ఇటీవల కేంద్రాన్ని కోరింది. చార్జీలు పెంచటం కోసం హైదరాబాద్ మెట్రో యాజమాన్యం చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఫేర్ ఫిక్స్డ్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ను ఈ కమిటీకి ఛైర్మన్గా నియమించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కమిటీ ప్రస్తుతమున్న మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను నవంబరు 15లోగా తెలపాలని ప్రయాణికులను కోరింది. కానీ చార్జీల ధర పెంచే విషయంలో హైదరాబాద్ వాసులు అంగీరించనట్లుగా తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం
Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
Bandi Sanjay | సచివాలయం డోమ్లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు