Home Latest News Mundra port Seizure | గుజరాత్‌ కేంద్రంగా డ్రగ్స్‌ దందా.. వచ్చిన డబ్బులు పాకిస్తాన్‌లోని లష్కరే...

Mundra port Seizure | గుజరాత్‌ కేంద్రంగా డ్రగ్స్‌ దందా.. వచ్చిన డబ్బులు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాకు ఫండింగ్‌

Mundra port Seizure | ముంద్రా ఎయిర్‌పోర్టు డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 2021లో గుజరాత్‌లో బయటపడ్డ డ్రగ్స్‌ కేసులో 22 మందిపై అభియోగాలు మోపింది. అందులో కాకినాడకు చెందిన మాచవరం సుధాకర్‌ కూడా ఉన్నాడు. వైజాగ్‌ కేంద్రంగా ఇతను ఫేక్‌ కంపెనీలు, షెల్‌ కంపెనీలు సృష్టించి అఫ్ఘనిస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ దిగుమతులు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఎన్‌ఐఏ విచారణ ప్రకారం.. బెంగాల్‌, గుజరాత్‌లోని పోర్టుల ద్వారా నిందితులు భారత్‌లోకి మాదకద్రవ్యాలను డంపింగ్‌ చేస్తున్నారు. ఢిల్లీలోని వేర్వేరు గోదాముల్లోకి తరలించి.. అక్కడి నుంచి ప్రధాన నగరాల్లోని పబ్బులు, నైట్‌ క్లబులకు సరఫరా చేస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని పాక్‌లోకి లక్షరే తోయిబాకు ఫండింగ్‌ పంపిస్తున్నారు.

2021 సెప్టెంబర్‌లో గుజరాత్‌లోని ముంద్రా ఎయిర్‌పోర్టులో 3 వేల కేజీల హెరాయిన్‌ పట్టబుడింది. టాల్కమ్‌ పౌడర్‌ ముసుగులో ఈ దిగుమతి జరిగింది. ఇంతలో టాల్కమ్‌ పౌడర్‌ ఎవరు దిగుమతి చేస్తున్నారా? అని ఆరా తీస్తే విజయవాడలోని సత్యనారాయణపురం గడియారం వీధిలోని ఒక అడ్రస్‌తో కంపెనీ రిజిస్టర్‌ అయ్యింది. ఆ కంపెనీ పేరే ఆషీ ఎంటర్‌ప్రైజెస్. దీని ఓనర్లు మాచర్ల సుధాకర్‌, వైశాలి. వీళ్లపై అప్పట్లో ఎన్‌ఐఏ దాడి చేసి వివరాలు సేకరించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version