Viral News | పెళ్లంటే గిల్లికజ్జాలు కామన్గానే ఉంటాయి. అమ్మాయి తరఫు మర్యాదలకు లోటు ఉందని అలకలు, పట్టింపులు వస్తూనే ఉంటాయి. ఇలాగే వధువు తరఫు నుంచి మర్యాదలు సరిగ్గా లేవని ఓ వరుడు తెగ ఫీలైపోయాడు. పెళ్లి కానుకగా పాత మంచం పంపించారని అలిగి ఏకంగా పెళ్లికే డుమ్మా కొట్టాడు. హైదరాబాద్లోని చాంద్రయాణగుట్ట పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్లోని మౌలాలికి చెందిన మహ్మద్ జకారియా (26) బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి చాంద్రయాణగుట్ట సమీపంలోని బండ్లగూడ రహమ్మత్ కాలనీకి చెందిన 22 ఏళ్ల యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 13వ తేదీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆదివారం రహమ్మత్ కాలనీకి సమీపంలోని మసీదులో పెళ్లి జరగాల్సి ఉంది. వాళ్ల ఆచారం ప్రకారం పెళ్లికి ముందు రోజు అంటే.. శనివారం సాయంత్రం జకారియా ఇంటికి అమ్మాయి వాళ్లు ఫర్నీచర్ పంపించారు. వాటిని చెక్ చేసుకుని.. మంచం విడిభాగాలు జోడిస్తున్న సమయంలో అది విరిగిపోయింది. దీంతో అత్తింటివాళ్లు పాత మంచానికే రంగులు వేసి పంపించారని భావించాడు. వాళ్లపై కోపం పెంచుకున్నాడు. వాళ్ల మీద అలిగి ఆదివారం నాడు పెళ్లికి వెళ్లలేదు.
ముహూర్తం దగ్గర పడుతున్నప్పటికీ పెళ్లివాళ్లు రాకపోవడంతో కంగారుపడిన వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లాడు. ఏమైందని అడగ్గా.. అసలు విషయం చెప్పాడు. మీకు మర్యాదలు తెలియవు.. పెళ్లివద్దంటూ గొడవపడ్డాడు. వరుడి తల్లి సైతం వధువు తండ్రితో గొడవపడ్డాడు. ఈ పరిణామంతో వధువు తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన ఎస్సై ఫోన్ చేసి నిలదీయగా వరుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ వరుడికి వధువు తండ్రి షాకిచ్చాడు. పెళ్లికి ముందే ఇంత గొడవ చేసిన వాడితో ఎప్పటికైనా ఇబ్బందేనని భావించి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. దీంతో వరుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
BRS MLA Sayanna | బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..
Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం