Home Latest News Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Khammam Sabha | ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్‌ బహిరంగ సభ దేశానికే ఓ దిక్సూచీ లాంటిదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ చేపట్టిన పోరాటానికి ఎప్పుడూ కూడా మా మద్దతు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఏవిధంగా అయితే రాచరిక వ్యవస్థను తరిమి కొట్టారో.. అదే విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని తరిమికొట్టే పోరాటం కూడా తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని అన్నారు.

తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఎంతో చైతన్యవంతులని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. సాయుధ పోరాటంలో రాచరికాన్ని తరిమి కొట్టిన వీరులని కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో మొదలు పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతమని కొనియాడారు పినరయి. ప్రధాని మోదీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని విమర్శించారు. రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు. దేశంలో ప్రస్తుతం మోదీ ఫెడరల్ స్ఫూర్తి వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Exit mobile version