Home Latest News D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ...

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

D Raja | ప్రస్తుతం భారత్‌ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్‌ ఆవిర్భావ సభలో డి. రాజా మాట్లాడుతూ.. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌ అంటూ… అంబానీ, ఆదానీతోనే మోదీ ఉండేది అంటూ సెటైర్లు వేశారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయని రాజా అన్నారు. వారి సిద్దాంతాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసినందుకు కేసీఆర్‌ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో ఏం జరుగుతుందా అని ప్రతి ఒక్క పౌరుడు చూస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకారిగా మారిందని విమర్శించారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందని.. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి దేశ మౌలిక వ్యవస్థల్నే మార్చాలని చూస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశం అతి పెద్ద సంక్షోభంలో ఉంది, గవర్నర్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.

తెలంగాణ అంటేనే ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు నిలయం.. ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వీరులను తలచుకుని రాజా జోహర్లు తెలిపారు. ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉద్యోగం… ఈ రంగాల్లో తెలంగాణ ముందుందని కొనియాడారు. విద్యుత్‌ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాజా అన్నారు. రైతుబంధు, దళితబంధు లాంటి అద్భుత పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

Exit mobile version