Amritsar-Singapore flight | టైం2న్యూస్, అమృత్సర్: పంజాబ్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన 35 మంది ప్రయాణికులను మర్చిపోయి వెళ్లిపోయింది సింగపూర్ విమానం. ప్రయాణికులు షెడ్యూల్ టైమ్కే వచ్చారు. లాంజ్లో వేచి ఉన్నారు. ఎంత సేపు వేచి చూస్తున్నా విమానాశ్రయ సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి విసిగిపోయిన ప్రయాణికులు సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో వారు చెప్పిన సమాధానం విని ఖంగుతినడం ప్రయాణికుల వంతు అయ్యింది.
ఈ ఘటన పంజాబ్ లోని అమృత్సర్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. రాత్రి ఏడున్నర గంటలకు రావాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటలకే సింగపూర్ వెళ్లిపోయిందని సిబ్బంది వెల్లడించారు. ఈ విషయం గురించి గట్టిగా నిలదీయడంతో ” టైమింగ్ మారిన విషయాన్ని మీకు మెయిల్ చేశాం… చూసుకోకపోవడం మీ తప్పు. అంతేకానీ ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఎలా ” అంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో 35 మంది ప్రయాణికులు ఏమి చేయలేక అక్కడే ఉండిపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం అసలు టైమ్ ప్రకారం సాయంత్రం 7 గంటలకు అమృత్ సర్ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే అమృత్ సర్ నుంచి వెళ్లిపోయింది. దీంతో సింగపూర్కు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నివ్వెర పోయారు. కాగా విమాన సమయంలో జరిగిన మార్పుల గురించి ప్రయాణికులకు తాము ముందుగానే తెలియజేశామని.. ఈ- మెయిల్ సందేశం ఇచ్చామని అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్ ఫైట్ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్పోర్టులోనే వదిలి వెళ్లిపోయింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!
Nepal Plane Crash | నేపాల్లో కూలిన విమానం యజమాని కూడా ఇలాగే.. హెలికాప్టర్ ప్రమాదంలో!
Top 30 Influencers | అరుదైన ఘనత సొంతం చేసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్