Nepal Plane Crash | నేపాల్లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఖాట్మాండు నుంచి 68 మంది ప్రయాణికులతో బయల్దేరిన యతి ఎయిర్ లైన్స్కు చెందిన ఈ విమానం మరి కొద్ది సేపటిలో పోఖరాలో ల్యాండ్ అవుతుందనగా మంటలు చెలరేగి కుప్పకూలింది. యతి ఎయిర్ లైన్స్ యజమాని కూడా ఇలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు.
యతి ఎయిర్లైన్స్ యజమాని అయిన అంగ్ టెష్రింగ్ షేర్పా ఫిబ్రవరి 2019లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. టెర్తుమ్ జిల్లాలో నూతనంగా ఓ విమానాశ్రయాన్ని నిర్మించాలని నేపాల్ ప్రభుత్వం అనుకుంది. ఇందులో భాగంగానే సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అప్పటి విమానయానశాఖ మంత్రి రవీంద్ర అధికారి, మరికొందరు విమానయాన అధికారులు టెష్రింగ్ హెలికాప్టర్లో వెళ్లారు.
అందులో ఉన్నవి 6 సీట్లే అయినప్పటికీ మొత్తం ఆరుగురు అందులో ఎక్కారు. వారితో ఆ హెలికాప్టర్ ఉదయం 6 గంటలకు బయల్దేరింది. విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా పతిభరా జిల్లాలోని టప్లేజుంగ్లో ఓ కొండ పైన మధ్యాహ్నం 1.30 సమయంలో హెలికాఫ్టర్ కూలిపోయింది.
ఈ ఘటనలో పైలట్ తో పాటు అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ఎయిర్ డైనస్టీ హెలి సర్వీసెస్ కు చెందింది. నేపాల్ లోని అత్యంత పురాతన హెలికాప్టర్ రెస్య్కూ కంపెనీ ఇది. ప్రమాదంలో అంగ్ టెష్రింగ్తో పాటు అప్పటి విమానయాన మంత్రి, ఆయన పీఎస్ఓ, సివిల్ ఏవియేషన్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ సెక్రటరి, మంత్రిత్వశాఖ డైరెక్టర్ మరణించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Nepal plane crash | న్యూ ఇయర్ రోజే ఎయిర్ పోర్టు ప్రారంభం.. 15 రోజులు కాకముందే కుప్పకూలిన విమానం
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం