MLA Raja Singh | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఈ వాహనం పలుమార్లు రిపేర్ వచ్చి నడిరోడ్డు మీద ఆగిపోయిందని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. తాను చస్తే ఎంత? బతికితే ఎంత అనే ధోరణిలో సీఎం కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చి కొత్తది ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు ఎన్నిసార్లు పంపిస్తున్నా కూడా.. దాన్నే రిపేర్ చేసి పంపిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు మాత్రం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఇలా పాడైపోయిన వాహనాన్నే ఎందుకు పంపుతున్నారని పోలీసు ఉన్నతాధికారులను అడుగుతుంటే.. ముఖ్యమంత్రి ఇదే వాహనాన్ని పంపామన్నారని వారు చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వాహనం నడిరోడ్డు మీద ఐదుసార్లు ఆగిపోయిందని ఆయన తెలిపారు.
ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరగాలని సూచిస్తున్నారు.. కానీ దాని పనితీరు బాగోలేక వేరే వాహనాల్లో వెళ్తుంటే పోలీసులు నోటీసులు అందజేస్తున్నారని తెలిపారు. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో వెళ్తుంటే అది ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Spouse Category | దిగివచ్చిన ప్రభుత్వం… తెలంగాణలో టీచర్ల స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్ కళ్యాణ్ వార్నింగ్
Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?