Delhi women commission chief | ఇండియన్ క్రికెటర్స్ అంటే ఎక్కడికి వెళ్లిన ఓ స్పెషల్ స్టేటస్ ఉంటుంది. బాగా ఆడితే వారిని పొగడ్తలతో ముంచెత్తుతారు. మ్యాచ్ కాస్త అటూ ఇటూ అయిందంటే.. క్రికెటర్లపై అభిమానులు విరుచుకుపడతారు. వాళ్లనే కాదు వారి కుటుంబసభ్యులపైన కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలాగే ధోని, విరాట్ కోహ్లీ కుమార్తెలపైనా సోషల్ మీడియాలో కొందరు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. వీటికి సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు.
భారత మాజీ కెప్టెన్లు ధోనీ, విరాట్ కోహ్లీల కుమార్తెలపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు చేసిన కొందరి స్క్రీన్ షాట్లను విడుదల చేశారు. ఇలాంటి వారిని అస్సలు విడిచిపెట్టొద్దని, కచ్చితంగా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ”అసలు 2 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిల గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారా ? మీరు ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే, అతని కుమార్తెను దుర్భాషలాడతారా ? వెంటనే వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులకు నోటీసులు జారీ చేశా” అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు