Jalebi Baba | జిలేబీ బాబాకు ఫతేహాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 120 మంది మహిళలపై అత్యాచారం చేసి, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల కోసం వేధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 35 వేల జరిమానా విధించింది.
హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లా తోహనా పట్టణంలో జీలేబీ బాబా జన్మించాడు. ఆయన అసలు పేరు అమర్ వీర్. 18 ఏళ్ల వయసులో ఫతేహాబాద్ వలస వచ్చి అక్కడే జిలేబీ దుకాణం పెట్టాడు. తనకు మంత్రాలు తెలుసని, దయ్యాలను వదిలిస్తా అంటూ అందరినీ నమ్మించాడు. బాబాగా పేరు మార్చుకున్నాడు. అమయాక మహిళలను మోసం చేస్తూ.. జిలేబీ దుకాణం నడిపే అమర్ వీర్ కాస్తా.. జిలేబీ బాబాగా మారిపోయాడు. తన వద్దకు వచ్చే మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి వీడియోలు తీసేవాడు. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు.
అయితే నాలుగేళ్ల క్రితం జిలేబీ బాబా ఆగడాలు బయటపడ్డాయి. 2018లో ఓ ఆలయంలో తనపై అత్యాచారం చేశాడని అతనికి తెలిసిన వాళ్లలో ఒకరి భార్య జిలేబీ బాబాపై కేసు పెట్టింది. దీంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన 120 వీడియోలను పోలీసులు అతని ఫోన్లో గుర్తించారు. మహిళలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు