India Vs New Zealand Tickets | ఈనెల 18 న భారత్, న్యూజీలాండ్ మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ( Uppal stadium ) లో తొలి వన్డే జరగనుంది. అయితే మ్యాచ్ టికెట్లకు సంబంధించిన హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ప్రకటన విడుదల చేశారు. మ్యాచ్ టికెట్లన్నీ ( match tickets ) ఆన్లైన్లోనే విడుదల చేస్తామని చెప్పారు. పేటీఎం వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు.
ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత కలెక్షన్ పాయింట్ల వద్ద ఫిజికల్ టికెట్లను కలెక్ట్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ చూపిస్తే టికెట్లు ఇస్తారు. అయితే కలెక్షన్ పాయింట్ల వద్ద ఫిజికల్ టికెట్ పొందాలంటే మాత్రం ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫిజికల్ టికెట్లను ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం (గచ్చిబౌలి) లో జనవరి 15 నుంచి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిజికల్ టికెట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ టికెట్ల కొనుగోలు విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల కోసం వచ్చిన క్రికెట్ అభిమానల మధ్య తొక్కిసలాట జరిగింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు హెచ్సీఏ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నెల 18 న భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగే వన్డే మ్యాచ్ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు.. టికెట్ల ధరలెంత.. ఒక్కొక్కరికి ఎన్ని టికెట్లు ఇస్తారు అనే వివరాలు మీకోసం..
అందుబాటులో అందుబాటులో ఉన్న టికెట్లు | 29,417 |
ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చేది | జనవరి 13, 14, 15, 16 ( ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ) |
13వ తేదీన 6 వేల టికెట్లు, 14న ఏడు వేలు, 15న ఏడు వేలు, 16న మిగిలిన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. | |
టికెట్ల ధరలు | రూ.850, రూ. 1000, రూ.1250, రూ. 1500, రూ. 2500, రూ. 5000, రూ. 7500, రూ.9000, రూ. 10,000, రూ. 17,700, రూ.20,650. |
ఒక్కొక్కరికి ఎన్ని టికెట్లు | గరిష్ఠంగా 4 టికెట్లు కొనొచ్చు |
కలెక్షన్ పాయింట్లు | ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం (గచ్చిబౌలి) |
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు