Jobs | ఏపీ గ్రూప్-2 ( Group-2 ), గ్రూప్-3 ( Group-3 )ఉద్యోగాల నియామక ప్రక్రియలో జగన్ సర్కార్ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాల నియమకానికి ఇక నుంచి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టెస్టును ఏపీపీఎస్సీ ( APPSC ), ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరూ గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల్లో ఉద్యోగం పొందలేరంటూ అడ్హక్ నిబంధనలు జారీ చేశారు. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు 30 శాతం, బీసీలు 35 శాతం, ఓసీలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర అంశాలపై సీపీటీ పరీక్ష ఉంటుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోల భాస్కర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా ఈ సీపీటీ పరీక్ష పాస్ కావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter