Nitiin & Rashmika Mandanna | నితిన్, రష్మిక మంధన్నా కలిసి నటించిన చిత్రం భీష్మ. 2020 ఫిబ్రవరి 21న వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అప్పటివరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ను మళ్లీ ట్రాక్ ఎక్కించింది. కానీ ఆ సినిమా తర్వాత మళ్లీ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు నితిన్. అందుకే తనకు సక్సెస్ రుచి చూపించిన రష్మికతో మరోసారి సినిమాను చేసేందుకు నితిన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. భీష్మ సినిమాకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుములనే ఈ చిత్రం తెరకెక్కిస్తుండటం విశేషం.
ఛలో, భీష్మ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల తన మూడో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో తీయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కమిటైన సినిమాను ముందుకు తీసుకెళ్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో హీరోహీరోయిన్లుగా నితిన్, రష్మికను తీసుకోవాలని వెంకీ కుడుముల భావిస్తున్నాడట. భీష్మ చిత్రంలో నితిన్, రష్మిక జోడీకి మంచి మార్కులు పడ్డాయి. కాబట్టి ఇదే జోడీని రిపీట్ చేసి హిట్ కొట్టాలని వెంకీ కుడుముల ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివరల్లో సెట్స్పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?
Jayasudha | అమెరికన్ బిజినెస్మ్యాన్తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?