Samantha | మయోసైటిస్తో బాధపడుతున్నట్టు సమంత ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక రూమర్ తిరుగుతూనే ఉంది. మొదట్లో ఆమె ఆరోగ్యం విషమించిందని.. చికిత్స కోసం విదేశాలకు వెళ్తుందని ఏవేవో అల్లేసుకుని ప్రచారం చేశారు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తుందని.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంటుందని తాజాగా ప్రచారం జరుగుతోంది.. ఈ వార్త వైరల్ కావడంతో సమంత పీఆర్ టీమ్ స్పందించింది.
సమంత గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సామ్ విశ్రాంతి తీసుకుంటుందని తెలిపింది. సంక్రాంతి తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా షూటింగ్లో పాల్గొంటుందని వెల్లడంచింది. అది పూర్తయిన వెంటనే బాలీవుడ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని స్పష్టం చేసింది. నిజానికి జనవరి నుంచి ఒక బాలీవుడ్ మూవీ షూటింగ్లో నటించాల్సి ఉండగా.. ప్రస్తుతం అది సాధ్యపడట్లేదని తెలిపింది. ఆ సినిమా ఆర్నెల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతటితో ఆగకుండా ఒకరికోసం దర్శక నిర్మాతలు వేచి ఉండటం మంచి విషయం కాదని పీఆర్ టీమ్ తెలిపింది. ఒకవేళ వేచి ఉండటం సాధ్యం కాకపోతే.. షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు అయితే సైన్ చేసిన ఏ సినిమా నుంచి కూడా సమంత తప్పుకోలేదని క్లారిటీ ఇచ్చింది. సామ్ సినిమాల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని పేర్కొంది.
సమంత నటించిన యశోద సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ మంచి వ్యూయర్షిప్ సొంతం చేసుకుంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.
Read More Articles |
Bigg Boss season 7 | బిగ్బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?
Mrunal Thakur | రెమ్యునరేషన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్