Mrunal Thakur | సీతారామం సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్.. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. లవ్ సోనియా, సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. కానీ ఆ సినిమాలు వేటితో రానంత గుర్తింపు సీతారామం సినిమాతో దక్కించుకుంది. ఈ సినిమాతో సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పిప్పా సినిమాలో నటిస్తున్న మృణాల్.. మీడియాతో ముచ్చటించింది. హీరోయిన్ల రెమ్యునరేషన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
రెమ్యునరేషన్ అడగడంలో హీరోయిన్లు వెనుకాడొద్దని..డిమాండ్ చేయాలని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రేక్షకుల్లో నటీనటులకు ఉన్న పాపులారిటీని బట్టే వాళ్లకు ఎంత పారితోషికం ఇవ్వాలనేది నిర్ణయిస్తారని తెలిపింది. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు తమకు కావాల్సినంత రెమ్యునరేషన్ అడగడానికి సందేహిస్తుంటారు.ఎలా అడగాలో తెలియక అయోమయంలో పడిపోతారు. కానీ అది మంచిది కాదని మృణాల్ స్పష్టం చేసింది. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలని.. అప్పుడే మన ప్రొఫెషన్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో అర్థమవుతుందని చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
తాను ఏమనుకుంటుందో మొహమాటం లేకుండా నిక్కచ్చిగా చెప్పడం ముందు నుంచి మృణాల్ ఠాకూర్కు అలవాటే. ఈ క్రమంలో ఆమె చేసే కామెంట్స్ కూడా కొంచెం బోల్డ్గా ఉంటాయి. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఒంటరిగా బతకడమే బెటర్ అని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే రూల్ ఏమీ లేదంటూ కామెంట్స్ చేసింది.ఈ వ్యాఖ్యలు కూడా ఆమధ్య సంచలనం సృష్టించాయి.
Read More Articles |
Ramya | అప్పుడు సమంత.. ఇప్పుడు దీపిక.. కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు.. మండిపడ్డ హీరోయిన్
Sreeleela | హైదరాబాద్లో సినిమా టికెట్లు అమ్మిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల