Itlu maredumilli prajaneekam | నాంది సినిమాతో తన రూట్ మార్చేశాడు అల్లరి నరేశ్. తనకు అచ్చొచ్చిన కామెడీ యాంగిల్ను వదిలేసి సామాజిక విషయాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అల్లరి నరేశ్కు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. అదే సీరియస్నెస్ను కంటిన్యూ చేస్తూ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో గత నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆనంది ఇందులో కథానాయికగా నటించింది. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే ఎన్నికల అధికారిగా అద్భుతంగా నటించాడు. విమర్శకులను సైతం అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదల అవుతుంది. ముందుగా అనుకున్న టైమ్ కంటే చాలా ముందుగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నిజానికి ఈ సినిమాను జనవరిలో స్ట్రీమింగ్ చేస్తారని మొదట్నుంచి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని జీ 5 నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 23వ తేదీ నుంచి తమ ఓటీటీ యాప్లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓటీటీ రిలీజ్ పోస్టర్ను విడుదల చేసింది.
Read More Articles |
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్
Mrunal Thakur | రెమ్యునరేషన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్