Rohit Sharma Interview | టైమ్ టు న్యూస్, హైదరాబాద్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ ప్రశంసలు కురిపించాడు. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్తో తొలి వన్డే అనంతరం శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్తో హిట్మ్యాన్ ప్రత్యేకంగా ముచ్చటించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇందులో రోహిత్ మాట్లాడుతూ.. ‘ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ చూసినందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు నాతో ఇద్దరు యువ ఆటగాళ్లు ఉన్నారు. గిల్తో ప్రారంభిస్తా.. శుభ్మన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం ఎలా అనిపిస్తోంది?’ అనిప్రశ్నించాడు. దీనికి బదులుగా ‘చాలా ఆనందంగా ఉంది. లంకతో సిరీస్లో ఒక సెంచరీ సాధించినా.. మిగిలిన రెండు మ్యాచ్ల్లో త్వరగా ఔటయ్యాను. ఈసారి అలా జరగకూడదని ముందే నిర్ణయించుకున్నా’ అని చెప్పుకొచ్చాడు.
భారత్ నుంచి ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అంతర్జాతీయ వన్డేల్లో ద్విశతకాలు నమోదు చేయగా.. ఇప్పుడా జాబితాలో శుభ్మన్ చేరాడు. దీంతో రోహిత్, ఇషాన్.. అరుదైన క్లబ్లోకి స్వాగతం పలికారు.
‘అన్నా నువ్వే కదా కెప్టెన్వి’
వీడియోలో భాగంగా మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్తో రోహిత్ మాట్లాడుతూ.. ‘బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ చేసిన తర్వాత మూడు మ్యాచ్ల్లో ఆడే అవకాశం దక్కలేదు కదా’ అని ప్రశ్నించగానే ఇషాన్ బదులిస్తూ.. ‘రోహిత్ భాయ్ నువ్వే కదా జట్టు కెప్టెన్వి’ అని అనడంతో ముగ్గురు ఒక్కసారి నవ్వుల్లో మునిగిపోయారు. సాధారణంగా ఓపెనర్ అయిన ఇషాన్.. ఉప్పల్ పోరులో మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చాడు. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘ఇప్పుడు నాలుగో స్థానంలో అవకాశం వచ్చింది. ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు నేను సిద్ధమే’ అని అన్నాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. ఇషాన్ సమయస్ఫూర్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పోరులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రోహిత్ సేన 12 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. భారీ లక్ష్యఛేదనలో బ్రాస్వెల్ భారత్ను భయపెట్టాడు.
ఎడాపెడా బౌండ్రీలతో విజృంభించి న్యూజిలాండ్ను విజయానికి చేరువచేశాడు. చివరి ఓవర్లో కివీస్ గెలుపునకు 20 పరుగుల అవసరం కాగా.. మొదటి బంతికే సిక్సర్ కొట్టి దాదాపు మ్యాచ్ను లాగేసుకునేలా కనిపించాడు. తదుపరి బంతి వైడ్ కాగా.. 5 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో శార్దూల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య శనివారం రాయ్పూర్ వేదికగా రెండో వన్డే జరుగనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Uppal Match | ఉప్పల్లో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్పై భారత్ ఘన విజయం
Junior NTR | యంగ్ టైగర్ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!
UPPAL STADIUM | ఉప్పల్ ఉప్పొంగేనా.. రేపు భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే
Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా