Twins Died | వాళ్లిద్దరూ కవలలు. ఒకరు గుజరాత్లోని సూరత్లో నివాసం ఉండగా.. మరొకరు రాజస్థాన్లోని జైపూర్లో ఉంటున్నారు. ఇద్దరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. సోదరుడి చదువు కోసం సూరత్లో కష్టపడుతుండగా ప్రమాదవశాత్తు ఒకరు మరణించారు. అతను మరణించిన గంటల వ్యవధిలో మరో సోదరుడు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కవలలిద్దరూ 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఒకే రకంగా గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని సర్నోకాతలాలో సుమేర్, సోహన్ సింగ్ (25) లు జన్మించారు. సుమేర్ గుజరాత్లోని సూరత్లో టెక్స్టైల్ సిటీలో పనిచేస్తుండగా.. సోహన్ జైపూర్లో గ్రేడ్ 2 టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. సుమేర్ పనిచేస్తూ సోహన్ను చదివిస్తున్నాడు. అంతా హాయిగా సాగిపోతున్న తరుణంలో సుమేర్ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ సూరత్లో నివాసం ఉంటున్న మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం సోహన్ కూడా జైపూర్లో ప్రమాదవశాత్తూ నీళ్ల ట్యాంకులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే సోహన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మరణించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ సభ్యులు మాత్రం సోహన్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. సోదరుడు చనిపోయిన విషయం తెలిసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గంటల వ్యవధిలో రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
సోదరులిద్దరూ ఎంతో అనుబంధంగా ఉండేవారని, ఇలా గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం దారుణమని వాపోతున్నారు. సుమేర్ చదువులో పెద్దగా రాణించలేకపోయినా.. సోహన్ చదువుకోవాలని ప్రోత్సహించాడు. సోదరుడు టీచర్ ఉద్యోగం సంపాదించేందుకు ప్రిపేరేషన్కు అయ్యే ఖర్చులు అందించేందు సుమేర్ పని చేయడం మొదలు పెట్టాడని గ్రామస్తులు చెప్పారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు నెలల్లో మరింత విజృంభించే ఛాన్స్
Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమెపైనే శంకర్ ఆరోపణలు!
Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !