Santokh singh chaudhary | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్ర ( Bharat Jodo Yatra )లో విషాదం నెలకొంది. పంజాబ్లోని ఫిల్లౌర్లో నిర్వహిస్తున్న యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి ( Santokh singh chaudhary ) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం యాత్రలో పాల్గొన్న ఎంపీ సంతోఖ్ సింగ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండె వేగం పెరిగింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో హుటాహుటిన ఫగ్వారాలోని విర్క్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఎంపీ మరణించినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సంతోఖ్ సింగ్ ప్రస్తుతం జలంధర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పంజాబ్ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kerala Schools | ఇక స్కూళ్లలో సర్… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్.. ఆదేశాలు జారీ !
Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు