Gruha Lakshmi Scheme | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం గృహలక్ష్మి విధి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకం గురించి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 119 నియోజకవర్గాల్లో గృహలక్ష్మి పథకం నియోజకవర్గానికి ౩ వేల మందికి ఇండ్లకు రూ. 3లక్షలు ఇస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలోనే ఎలాంటి స్థలంలోనైనా ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీదకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా గృహలక్ష్మి పథకం ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేసి కలెక్టర్లకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను మహిళలనే ఎంపిక చేస్తామని, వారి పేరు మీదనే ఇండ్లను రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఇందుకోసం భర్త పేరు మీద ఉన్న భూమిని ఉచితంగా భార్య పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.
ఈ పథకం కింద ఇచ్చే రూ. 3 లక్షలను కూడా మూడు విడతల్లో ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పునాది సమయంలో రూ. లక్ష రూపాయలను మహిళ అకౌంట్లో జమచేస్తామన్నారు. శ్లాబ్ వేసిన తర్వాత మరో లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక సున్నాలు వేసే సమయంలో మిగిలిన లక్ష రూపాయలను మహిళ ఖాతాలో వేస్తామని చెప్పారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!