Malakpet Hospital | మలక్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతల మృతి కీలక మలుపు తిరిగింది. నిన్నటి వరకు వైద్యుల తప్పులేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగానే మలక్పేట ప్రభుత్వాస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. మరో 18 మందికి కూడా ఇన్ఫెక్షన్ సోకిందని, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేల్చారు.
మలక్పేట ప్రభుత్వాస్పత్రిలో అపరిశుభ్రతే బాలింతల మృతికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. మృతి చెందిన ఇద్దరితో పాటు అంతకుముందు సిజేరియన్ చేయించుకున్న మరో 18 మందిని నిమ్స్ ఎమర్జెన్సీకి అప్పటికప్పడు తరలించారు. వారిలో ఇద్దరికి కిడ్నీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో రెండు రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మరో తొమ్మిది మందిని సోమవారం డిశ్చార్జి చేయగా.. ఏడుగురు బాలింతలకు చికిత్స అందిస్తున్నారు.
మలక్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్నాక నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదుమపల్లికి చెందిన సిరివెన్నెల, హైదరాబాద్ పూసలబస్తీకి చెందిన శివానీ మరణించారు. వైద్యల నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీసిందని కుటుంబసభ్యలు, బంధులువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. అయితే ప్రాథమిక విచారణలో వైద్యుల నిర్లక్ష్యం లేదని తేల్చారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి నివేదిక బయటకు రావడం, వైద్యుల నిర్లక్ష్యమే మృతికి కారణమని తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం