nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదం ఎందరో జీవితాల్లో విషాదాన్ని నింపింది. కాసేపట్లో ల్యాండ్ అవుతోంది అనగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎతి ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 72 మంది సజీవదహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. వారిలో నలుగురు ఉత్తర ప్రదేశ్కు చెందిన వారే. వారంతా కూడా స్నేహితులు.
యూపీలోని ఘజిపూర్ జిల్లాకు చెందిన సోనూ జైస్వాల్ అనే వ్యక్తి పూజ మొక్కులు చెల్లించుకునేందుకు ఖాట్మాండులోని పశుపతినాథ్ ఆలయానికి వెళ్లారు. తన వెంట మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. అయితే వారు విమానంలో ప్రయాణించే సమయంలో ఫేస్బుక్ లైవ్ ఉంచారు. ఆ వీడియోలో యువకులందరూ కూడా ఎంతో సరదాగా కనిపిస్తున్నారు. నవ్వులు, కేరింతలతో గడుపుతున్నారు. అయితే ఆ వీడియో విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందే తీసింది. ఇందులో ప్రమాదం ఎలా జరిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి వరకు సరదాగా ఉన్న వారంతా కొన్ని సెకన్లలోనే సజీవ దహనం అయ్యారు. వారు తీసిన వీడియోలో 1.3 నిమిషాలు పాటు ఉంది.
విమానం గాలిలో ఉన్నప్పుడు కిటికిలోంచి పోఖరా పట్టణాన్ని చూపిస్తూ వారిలో ఒకరు ఉత్సాహంగా మౌజ్ కర్ ది అంటూ కేకలు వేస్తున్నారు. వీడియో రికార్డు చేస్తున్న యువకుడు సోను జైశ్వాల్ మాత్రమే ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా కనిపించారు. ఈ వీడియోలోని 58 సెకన్ల వద్ద విమానం వేగంగా ఎడమ వైపు మలుపు తిరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. తరువాత 30 సెకన్ల పాటు ఫోన్ కెమెరాలో మంటలు కనిపించాయి
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన
Ratan Tata | తనకు ఇష్టమైన కారు గురించి రతన్ టాటా భావోద్వేగపు పోస్టు.. నెట్టింట వైరల్!