CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పొత్తి కడుపులో నొప్పిగా ఉండటంతో ఆదివారం ఉదయం ఆయన్ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు ఎండోస్కోపీ, సీటీస్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో కేసీఆర్ కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మందులతో అల్సర్ తగ్గిపోతుందని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా, మిగతా వైద్య పరీక్షల రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!