Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsIPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా...

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

IPL 2023 | టైమ్‌ 2 న్యూస్‌, మొహాలీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్‌ కింగ్స్‌ 7 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో) కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స (32 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (40; 6 ఫోర్లు) రాణించాడు.

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23), జితేశ్‌ శర్మ (21), సామ్‌ కరన్‌ (26 నాటౌట్‌), సికందర్‌ రజా (16) తలా కొన్ని పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులతో నిలిచిన సమయంలో భారీ వర్షం పడింది. అనంతరం తిరిగి మ్యాచ్‌ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం విజేతను నిర్ణయించారు. 16 ఓవర్లలో కోల్‌కతా 154 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆ జట్టు మరో 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

విండీస్‌ విధ్వంసక బ్యాటర్‌ ఆండ్రూ రస్సెల్‌ (19 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దడదడలాడించగా.. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (24), వెంకటేశ్‌ అయ్యర్‌ (34), రహ్మానుల్లా గుర్బాజ్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా టాపార్డర్‌ను కకావికలం చేసిన పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారీ షాట్లతో విజృంభిస్తున్న రస్సెల్‌ను సామ్‌ కరన్‌ ఔట్‌ చేయడంతో పంజాబ్‌ సునాయాసంగా విజయం సాధించింది.

ధవన్‌ రికార్డు

పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే శిఖర్‌ ధవన్‌ ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి కీలక ఇన్నింగ్స్‌ ఆడిన గబ్బర్‌.. జట్టుకు మంచి ఆరంభం అందించాడు. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ త్వరగానే పెవిలియన్‌ చేరినా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ భానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో శిఖర్‌ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్లో అత్యధిక అర్ధశతక భాగస్వామ్యాల్లో భాగం పంచుకున్న ప్లేయర్‌గా విరాట్‌ కోహ్‌లీని సమం చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కోహ్లీ ఇప్పటి వరకు 94 హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా.. ఇప్పుడు ధవన్‌ అతడిని సమం చేశాడు. ఈ జాబాతాలో సురేశ్‌ రైనా (83 హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాలు), డేవిడ్‌ వార్నర్‌ (82 అర్ధశతక భాగస్వామ్యాలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News