Narendra Modi Security | ఎన్ఎస్జీ కమాండో వేషంలో ఓ వ్యక్తి ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హై సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు. ప్రధాని మోదీ అక్కడికి చేరుకోవడానికి ఇంకా గంటన్నర సమయం ఉండగానే అతడిని పోలీసులు వేరే చోటకు తరలించి విచారిస్తున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇండియన్ ఆర్మీలో నాయక్ గా పనిచేస్తున్నట్లుగా నిందితుడు చెప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి నకిలీ ఎన్ఎస్జీ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నవీ ముంబైకి చెందిన రామేశ్వర్ మిశ్రాగా నిందితుడ్ని గుర్తించారు. అతడు ఎన్ఎస్జీ సిబ్బందిగా నటిస్తూ.. మోదీకి భద్రత కల్పించిన బీకేసీ ప్రాంతంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వద్ద ఉన్న హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అతడిని ముందుగానే అరెస్ట్ చేశారు.
కమాండో వేషంలో ఉన్న అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని కాసేపు అనుసరించి, అదుపులోనికి తీసుకున్నామని ముంబై పోలీసులు వివరించారు. మిశ్రాను ఐపీసీ సెక్షన్ 171, 465, 468, 471 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి కోరినట్లు తెలిపారు. నిందితుడ్ని జనవరి 24 వరకు కోర్టు కస్టడీకి అప్పగించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?
India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం