Naga babu | ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్పై పోటీ చేయడానికైనా సిద్ధమే అంటూ ఇటీవల వైఎస్సాఆర్సీపీ నేత ఆలీ అన్న మాటలకు జనసేన నేత నాగబాబు రియాక్ట్ అయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడిన నాగబాబు.. వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలా దిగజారి మాట్లాడమని అన్నారు . అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.
గడిచిన నాలుగు సంవత్సరాలలో ఏపీలో పరిపాలన ఎంత చెత్తగా ఉంది అనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ నాలుగేళ్లు కూడా రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి రాజ్యంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ముందుకు వెళ్లే ప్రణాళికలు గురించి జనసేన సైనికులతో మాట్లాడటం జరిగిందని నాగబాబు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని చెప్తూనే పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల గురించి మాట్లాడేది కేవలం పార్టీ అధినేత పవన్ మాత్రమేనని స్పష్టం చేశారు. పొత్తుల గురించి క్లారిటీ లేకుండా పోటీ చేసే స్థానాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. పవన్ ప్రతి మాట వెనుక ఏదోక వ్యూహం ఉండే ఉంటుందని నాగబాబు అభిప్రాయపడ్డారు.
పోత్తు లేని పక్షంలో ఏపీలో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను మాత్రం పోటీ చేయడం లేదంటూ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. 2019లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధిస్తామని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan kalyan | వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సెన్సేషనల్ కామెంట్స్