Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsKTR | ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. వామ్మో తెలంగాణకు అన్ని కోట్ల పెట్టుబడులా?

KTR | ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. వామ్మో తెలంగాణకు అన్ని కోట్ల పెట్టుబడులా?

KTR | దావోస్‌లో జరుగుతున్న 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సులో సమావేశాలు జరిగినట్లు వివరించారు.

కేటీఆర్ 4 రోజుల దావోస్ పర్యటనలో మొత్తంగా రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లుగా ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఆయా కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ చర్చలు జరిపారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

దావోస్‌‌లో ఏర్పాటు చేసిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తన బృందంతో కలిసి మొత్తం 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 2 ప్యానెల్‌ చర్చలు నిర్వహించినట్లుగా ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. 21 వేల కోట్ల పెట్టుబడుల్లో భాగంగా గ్లోబల్ మల్టీ బ్రాండ్‌ రెస్టారెంట్‌ కంపెనీ ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ హైదరాబాద్‌లో సపోర్ట్‌ సెంటర్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ముందుకొచ్చింది.

అంతేకాదు జనవరి 19 న జెఫ్‌ మాగియోన్‌ కాల్డా బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. వ్యూహాత్మక పొత్తుల ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశోధనలలో సహకార అవకాశాల గురించి ఆ కంపెనీ సీఈవో కోర్సెరాతో చర్చించారు. దావోస్ పర్యటనలో కేటీఆర్‌ బిజీగా గడిపి పరిశ్రమలను తెలంగాణకు వచ్చేలా చేయడంలో విజయం సాధించారు.

సాఫ్ట్‌వేర్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దావోస్‌ వేదికగా ఆయన ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Naga babu | ఏపీలో జనసేన పొత్తులపై మెగాబ్రదర్ కీలక వ్యాఖ్యలు.. పవన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్న నాగబాబు!

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News