Kangana Ranut | ఒక సినిమాని నిర్మించాలంటే దాని వెనుక ఎంతో మంది కష్టంతో పాటు ఖర్చు కూడా ఉంటుంది. సినిమా నిర్మాణం కోసం తమ ఆస్తులను సైతం పొగొట్టుకొని రోడ్డున పడ్డవారు ఉన్నారు. కొందరైతే అప్పులు పాలయ్యి ప్రాణాలు తీసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సినిమా కోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారట. ఈ విషయాన్ని తాజాగా కంగనా బయటపెట్టింది.
కంగనా రనౌత్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తూ.. డైరెక్ట్ చేస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ చిత్రం కోసం కంగనా ఆమె ఆస్తులన్నిటిని తాకట్టు పెట్టారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో సినిమా గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యారు.
”ఎమర్జెన్సీ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాను. దీని కోసం నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను. సినిమా మొదలైనప్పటి నుంచి ఏదోక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటునే ఉన్నాను. మొదటి షెడ్యూల్ లో డెంగ్యూ బారిన పడ్డా. అన్ని విషయాలను నేను మీతో పంచుకోలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారు బాధపడకూడదు. అంతే కాకుండా నన్ను ద్వేషించే, విమర్శించే వారికి కూడా నేను ఎటువంటి ఛాన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు. ఎవరికైనా ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను” అని అన్నారు.
మీరు కలలు కన్న దాని కోసం కష్టపడితే అది అయిపోతుంది అనుకోవడం అబద్ధం. ఒక్కోసారి మన చేతనైనా దాని కంటే ఎక్కువే కష్టపడాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఎన్నో కష్టాలు పడాల్సి కూడా వస్తోంది. దాన్ని కూడా మనం సంతోషంగా స్వాగతించాల్సి ఉంటుంది. ఎవరికైనా అది ఓ పునర్జన్మ లాంటిదే… నిజం చెప్పాలంటే నాకు కూడా ఓ పునర్జన్మే. నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరు బాధపడకండి. నాకు మీ ఆశీర్వాదాలు… ప్రేమ మాత్రమే కావాలి” అంటూ చెప్పుకొచ్చింది. కాగా కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు