Vande Bharat Express | సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన బుకింగ్స్ను రైల్వే శాఖ ఓపెన్ చేసింది. శనివారం నుంచి టికెట్లను అందుబాటులో ఉంచింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు టికెట్ ధరలను, ట్రైన్ టైం టేబుల్ను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా… ఇది ఎనిమిదో రైలు. ఈ ట్రైన్ లోని ఏసీ,నాన్ ఏసీ బోగీలలో కలిపి మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చని తెలిపింది. వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య పరుగులు పెడుతుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్ రాహుల్
Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?