Honeymoon | కొత్తగా పెళ్లయ్యింది.. కొత్త జీవితం మొదలైంది. కొత్తల్లోనే భార్యను అర్థం చేసుకోవాలి.. ఆమెతో సరదాగా గడపాలని ఆశపడ్డాడు ఆ యువకుడు. భార్యతో కలిసి ఇండోనేసియాకు హనీమూన్కు వెళ్లాడు. కానీ వారి ప్రేమ యాత్ర విషాదంగా మారింది. అక్కడ మధురానుభూతులు పంచుకోవడానికి వెళ్లి విగతజీవి అయ్యాడు. గుండెపోటుతో కన్నుమూశాడు.
హైదరాబాద్లోని నాగోలు డివిజన్ అజయ్ నగర్ కాలనీకి చెందిన రాముని రవీందర్ అల్కపురి చౌరస్తాలో హోటల్ నిర్వహిస్తుంటాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. చిన్న కొడుకు వంశీకృష్ణ (27)కు కర్మాన్ఘాట్కు చెందిన శ్రావణితో గత ఏడాది జూన్ 23న పెళ్లి జరిగింది. హనీమూన్ కోసం ఈ నెల 13న భార్యతో కలిసి హనీమూన్ కోసం మొదట మలేసియా వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 19న ఇండోనేసియాలోని బాలికి వెళ్లాడు.
ఈ క్రమంలో ఈ నెల 22న బాలికి కొంతదూరంలోని పెన్నిడా ఐలాండ్కు వెళ్లారు. అక్కడి సముద్ర అడుగులోని అక్వేరియంలో చేపలను చూసేందుకు 20 మంది పర్యాటకులు, ముగ్గురు గైడ్లతో కిందకు వెళ్లాడు. ఆక్సిజన్ మాస్క్, డైవింగ్ షూతో సముద్రంలోకి దిగాడు. కానీ ఆ సమయంలో సముద్రంలో గల్లంతయ్యాడు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని వెలికితీశారు. అయితే సముద్రం అడుగులోకి వెళ్లే క్రమంలో భయపడి, హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు బాలి పోలీసులు డెత్ రిపోర్టులో పేర్కొన్నారు. భార్యతో సరదాగా హనీమూన్కు వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గ్రూప్ 1 మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న వంశీకృష్ణ
వంశీకృష్ణ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పోటీపరీక్షలకు కూడా సిద్దమవుతున్నాడు. ఇటీవల సివిల్స్ రాశాడు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అర్హత సాధించడంతో మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. సివిల్స్ కూడా రాశాడు. వంశీకృష్ణ అన్న నవ్య కృష్ణ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Women’s IPL | పురుషుల ఐపీఎల్ను మించిపోయిన మహిళల లీగ్.. రికార్డు ధరకు వేలం