Kirak RP | జబర్దస్త్తో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ.. షో మానేసి కర్రీపాయింట్ పెట్టుకున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్లోనే వ్యాపారం మొదలుపెట్టాడు. దీన్ని మొదలుపెట్టిన కొద్దిరోజులకే చాలా పాపులర్ అయిపోయింది. విపరీతంగా జనాలు ఇక్కడికి వచ్చి చేపల పులుసు కొనుక్కెళ్లారు. దీంతో కస్టమర్లకు సరిపడా చేపల పులుసు అందించలేకపోవడంతో సంక్రాంతి ముందు షాప్ కట్టేసి నెల్లూరు వెళ్లి మరి వంటగాళ్లను తీసుకొచ్చాడు. షాప్ మళ్లీ రీఓపెన్ చేసి బిజినెస్ అదరగొడుతున్నరు. ఇలా మూడు పూలు ఆరు కాయలుగా సాగిపోతున్న కిరాక్ ఆర్పీ కర్రీ పాయింట్పై ఈ మధ్య నెగెటివ్ టాక్ వస్తోంది. చేపల పులుసు టేస్ట్ బాగోవడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇది చూసిన కిరాక్ ఆర్పీ సీరియస్ అయ్యాడు.
తన చేపల పులుసు బాగోలేదంటూ వస్తున్న వార్తలపై కిరాక్ ఆర్పీ రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మండిపడ్డాడు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక.. ఇలా పనిగట్టుకుని మరీ నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యాడు. ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే అని చెప్పుకొచ్చాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని.. మోసం చేసి ఎన్నాళ్లూ బిజినెస్ చేయలేరని అన్నాడు. చేపల పులుసు రుచి లేకపోతే ఇంతమంది కస్టమర్లు మళ్లీ మళ్లీ రారు కదా అని ప్రశ్నించాడు. అందరూ టేస్ట్ బాగుందని చెబుతుంటే ఎవరో ఒకరిద్దరు బాగోలేదని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటే వాళ్లు ఎంత ఓర్వలేని వాళ్లో అర్థమవుతుందని చెప్పాడు. తన కిచెన్లో ఎన్నో వీడియోలు తీశానని.. అవే తన నిజాయతీని నిరూపిస్తాయని తెలిపాడు. తనను ఎవరూ బ్యాడ్ చేయలేరని.. ఎంత నెగెటివ్ చేస్తే అంత ప్రమోషన్ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా
Bhanupriya | మెమొరీ లాస్తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట
Sundeep Kishan | రెజీనాతో డేటింగ్పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్